28న అఖిలపక్షం జరగాల్సిందే: జానారెడ్డి

నల్లగొండ : తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఈనెల 28న నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం జరగాల్సిందేనని రాష్ట్రమంత్రి జానారెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశాన్ని వాయిదా వేయరాదని ఆయన కోరారు. ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో తెలంగాణ ప్రజలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇబ్బందులకు గురి చేయవద్దని ఆయన అన్నారు.