29న బింబిసార ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ పాన్‌ ఇండియా సినిమా ’బింబిసార’ ఈ సినిమా గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చే గెస్ట్‌ని చిత్రబృందం ప్రకటించింది. 2020లో వచ్చిన ఎంత మంచివాడవురా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీని తర్వాత మళ్ళీ కళ్యాణ్‌ రామ్‌ నుంచి సినిమా రాలేదు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో కాస్త ఆలస్యం అయినా హిట్‌ కొట్టే కథతోనే రావాలని ఎదురుచూసి ఎట్టకేలకి బింబిసార సినిమాతో రాబోతున్నాడు. యువ దర్శకుడు మల్లిడి వశిష్ట్‌ తొలిసారిగా మెగా ఫోన్‌ పట్టి తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీలో క్యాథరీన్‌ థ్రెసా, సంయుక్తా విూనన్‌ , వరీన హుస్సేన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే బింబిసార నుంచి వచ్చిన థియేట్రికల్‌ ట్రైలర్‌ ఇప్పటికే యూట్యూబ్‌ లో రికార్డ్‌ స్థాయిలో వ్యూస్‌ రాబట్టి సెన్సేషన్‌ ని క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఆగష్టు 5న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన మేకర్స్‌ ఇదే నెల 29న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ గ్రాండ్‌ ఈవెంట్‌కి నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సోదరుడు పాన్‌ ఇండియన్‌ స్టార్‌ యంగ్‌ టైగర్‌ ఎన్‌.టి.ఆర్‌ చీఫ్‌ గెస్ట్‌గా రాబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్‌ విూడియా ద్వారా ఓ వీడియోను వదిలారు. ఇక ఈ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక నందు నిర్వహించనున్నారు. జూలై 29 సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్‌ మొదలవనుందని చిత్రబృందం ప్రకటించింది. కాగా, ఎన్టీఆర్‌ ఆర్ట్స్పతాకంపై కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, హై టెక్నీకల్‌ వాల్యూస్‌ తో నిర్మిస్తున్నారు. త్రిగర్తల రాజ్య ప్రభువు అయిన బింబిసారుడుగా కళ్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో కనిపించనున్నాడు. చిరంతన్‌ భట్‌ మ్యూజిక్‌, ఎం ఎం కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు