60 కేజీల వెండి పట్టివేత!

987మహబూబ్‌ నగర్:

మహబూబ్‌ నగర్ జిల్లా షాద్‌నగర్ టోల్ ప్లాజా దగ్గర ఎక్సైజ్ పోలీసులు భారీ మొత్తంలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించగా 60 కిలోల వెండి బయటపడింది. ఆ వెండిని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. నూతన సంవత్సరం నేపథ్యంలో విదేశీ మద్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు జరిపిన చెకింగ్ లో భాగంగా వెండి బయటపడిందని అధికారులు తెలిపారు.