ప్రముఖ బాలివుడ్‌ నటుడు ప్రాణ్‌ ఇకలేరు


ముంబయి, జూలై 12 (జనంసాక్షి) :
ప్రముఖ బాలివుడ్‌ నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రాణ్‌ (93) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రాత్రి ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రాణ్‌పూర్తి పేరు ప్రాణ్‌ కృష్ణన్‌ సికంద్‌. ఢిల్లీలో జన్మించిన ఆయన 350కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఖాందాన్‌, మధుమతి, జిస్‌ దేశ్‌ మే గంగా బహ్తీ హై, ఉప్కార్‌, డాన్‌, జంజీర్‌, దునియా లాంటి హిట్‌ చిత్రాల్లో ఆయన నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. మూడు సార్లు ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు. తెలుగులో కొదమసింహం చిత్రంలో ఆయన హీరోయిన్‌ తండ్రిగా నటించారు.