తెలంగాణ ఇచ్చేస్తే విజయవాడే రాజధాని చేయండి


మంత్రి పార్థసారథి
విజయవాడ, జూలై 13 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే సీమాంధ్ర ప్రాంత రాజధానిగా విజయవాడను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె. పార్థసారథి అన్నారు. శనివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారేందుకు ప్రతి ఒక్కరు తోడ్పాటు నందించాలని కోరారు. 21వేల టీచర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను నవంబర్‌లో జారీ చేయనున్నట్టు చెప్పారు. అలాగే టెట్‌ పరీక్షను సెప్టెంబర్‌ 1న నిర్వహించి అదే నెల 20న ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. డీఎస్సీ నిర్వహణ తేదీలపై కసరత్తు కొనసాగుతోందని.. త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని అన్నారు. భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రలో కలిపి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని సూచించారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని తెలిపారు.