భారీ నామినేషన్లు


కరీంనగర్‌ ఫస్ట్‌, రంగారెడ్డి లాస్ట్‌
ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌
హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) :
పంచాయతీల్లో నామినేషన్ల జాతర సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌ పదవులకు 1,29,005 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ వెల్లడించారు. ఆదివారం ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. వార్డు సభ్యుడి పదవులకు 5,66,446 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాలో నామినేషన్లు దాఖలయ్యాయి. 1,207 గ్రామ పంచాయతీలకు 9,363 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలో అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో దాఖలైనట్టు చెప్పారు. 649 పంచాయతీలకు కేవలం 3,924 నామినేషన్లు దాఖలయ్యాయని నవీన్‌ వెల్లడించారు. ఆదివారం నామినేషన్ల పరిశీలిన, అభ్యంతరాల స్వీకరణ పూర్తి చేశామని, ఉప సంహరణ అనంతరం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు ప్రకటించి, గుర్తులు కేటాయిస్తామని చెప్పారు.