థర్డ్‌ఫ్రంట్‌పై అఖిలేశ్‌తో బాబు సమాలోచనలు


హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) :
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడో కూటమి ఏర్పాటుపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో చర్చలు జరిపారు. శనివారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న అఖిలేశ్‌ సాయంత్రం చంద్రబాబు నివాసానికి వెళ్లి కలిశారు. వీరి భేటీలో థర్డ్‌ ఫ్రంట్‌తో పాటు పలు జాతీయ రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు. అంతకుముందు తెలంగాణ జేఏసీ నాయకులు, కుల సంఘాలు, ప్రజాసంఘాల నేతలు అఖిలేశ్‌ను కలిసి తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశపెడితే మద్దతు ఇవ్వాలని కోరారు.