భారత్‌ బయల్దేరిన బైడెన్‌


ఆర్థిక విధానాలపైనే కీలక చర్చలు
న్యూఢిల్లీ, జూలై 21 (జనసాంక్షి) :
అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌కు బయల్దేరారు. ఆయన నాలుగు రోజులపాటు మనదేశంలో పర్యటించనున్నారు. సతీసమేతంగా సోమవారం న్యూఢిల్లీ చేరుకుంటారు. అనంతరం మహాత్మగాంధీ స్మృతి ప్రదర్శనశాలను సందర్శిస్తారు. 23న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌లతో భేటీ అవుతారు. అలాగే వాణిజ్య, విద్యుత్తు రక్షణ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చిస్తారు. 24, 25 తేదీల్లో ముంబాయి పర్యటనలో భాగంగా ఆయన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో వ్యాపారరంగ ప్రముఖులతో సమావేశం కానున్నారు. 25న సాయంత్రం సింగపూర్‌ బయల్దేరి వెళ్తారు. 2008లో సెనేటర్‌ హోదాలో భారత్‌ను సందర్శించిన జో బైడెన్‌, సోమవారం ఉపాధ్యక్షుడి హోదాలో తొలిసారిగా పర్యటించనున్నారు.