ఈ గవర్నెన్స్‌లో మనమే ఫస్ట్‌


సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్‌, జూలై23 (జనంసాక్షి) :
ఈ-గవర్నెన్స్‌ వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో మన రాష్ట్రం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల ప్రదర్శన ఈ-ఇండియాను హైదరాబాద్‌ హైటెక్స్‌లో సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో దళారీ వ్యవస్థను దూరం చేసే విధంగా పారదర్శకతతో నడుస్తున్న మీ సేవ ద్వారా నిత్యం లక్షన్నర వరకూ 150 రకాల పనులను నిమిషాల వ్యవధిలో పూర్తి చేయగలుగుతున్నామని సీఎం చెప్పారు. దీని ద్వారా అవినీతి రూపంలో ప్రజలకు నాలుగు నుంచి ఐదు వందల కోట్ల రూపాయాలు నష్టాన్ని దూరం చేయగలిగామన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో విద్య, వైద్యం, ఈ-బ్యాంకింగ్‌, ఈ-గవర్నెన్స్‌కు సంబంధించి పలు స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కావూరి, రాష్ట్ర ఐటీ మంత్రి పొన్నాల పాల్గొని ఐటీ ద్వారా రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధిని కొనియాడారు. పలువురు ఐటిరంగ నిపుణులు ఇందులో పాల్గొన్నారు.