ఓయూలో అంబరాన్నంటిన సంబరాలు

హైదరాబాద్‌, జూలై 30 (జనంసాక్షి)

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం తో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఖిల్లా ఉస్మా నియా యూనివర్సిటీలో సంబ రాలు అంబరాన్నంటాయి. వర్సిటీలో విద్యా ర్థుల పెద్ద ఎత్తున హాస్టళ్ల నుంచి బయ టికి వచ్చి సంబరాలు జరుపు కున్నారు. తెలంగాణ అమరవీరులకు కొవ్వొతుల తో నివాళులర్పించారు. ఈ సందర్భం గా వర్సిటీలో ప్రదర్శన నిర్వహించారు. ఓయూకు ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద జై తెలం గాణ నినాదాలు చేశా రు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బాణాసంచా కాల్చా రు. కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ ప్రభుత్వం వెంట నే పార్లమెంట్‌ తెలంగాణ బిల్లు పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయా లని కోరారు.