విజయశాంతి సస్పెన్షన్
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే : కేసీఆర్
హైదరాబాద్, జూలై 31 (జనంసాక్షి) :
మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యురాలు విజయశాంతిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే సస్పెండ్ చేయాలని పొలిట్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు పార్టీ అధినేత కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం రాత్రి తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్తో మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన విజయశాంతి ఇటీవల పార్టీ వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, ఈ మేరకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.