నువ్వు సీఎంవా.. సీమాంధ్ర జాక్‌ నాయకుడివా?


కిరణ్‌పై పొన్నం ఫైర్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) :
నువ్వు ముఖ్యమంత్రివా లేకుంటే సీమాంధ్ర జాక్‌ నాయకుడివా అంటూ కరీంనగర్‌ ఎంపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలదీశారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌ కోసం సీమాంధ్ర ప్రాంత నాయకులు తెచ్చిన లేఖపై తాను సంతకం చేశానన్న సీఎంపై ఆయన ఫైర్‌ అయ్యారు. ముఖ్యమంత్రి సీమాంధ్ర ప్రాంత ప్రతినిధి మాట్లాడటం భావ్యం కాదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మొదటి నుంచి తెలంగాణకు అడ్డు తగులుతున్నారని, ఆయన వ్యవహారశైలిపై చర్చించేందుకు శుక్రవారం తెలంగాణ ప్రాంత నేతలం భేటీ అవుతామని చెప్పారు. తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల కలను అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.