వైద్య సదస్సును ప్రారంభించిన గవర్నర్‌ నరసింహన్‌

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి):ఎస్వీఎస్‌ ఆస్పత్రిలో మూడు రోజులపాటు జరగనున్న 41 వ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ సదస్సును రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ గిరిజాశంకర్‌, ఎస్పీ నాగేంద్రకుమార్‌, ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి గవర్నర్‌కు స్వాగతం పలికారు. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.