సీఎం వ్యాఖ్యలకు కలత చెంది యువకుడి ఆత్మహత్య


జగిత్యాల, ఆగస్టు 10 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకునే విధం గా ఆయన సీఎం కిరణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు కలత చెంది మల్లాపూర్‌ మండలం రాఘవపేటకు చెందిన ఒల్లెపు సాయికు మార్‌ (17) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి టి.విలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలను విని కలత చెందాడు. తెలంగాణ రాష్ట్రం ఇక రాదేమోనని భావించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా చావుతోనైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలి, అమ్మా.. నా కోసం కలత చెందకండి నాన్న, చెల్లెలిని ఎదురుచూడకుమని చెప్పు’ అని సాయికుమార్‌ సూసైడ్‌నోట్‌ రాసుకున్నాడు.