హైదరాబాద్‌పై రాజీలేదు సీమాంధ్రుల రక్షణకు ఢోకా లేదు : కోదండరామ్‌


హైదరాబాద్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ తెలంగాణ ప్రజల సొంతమని, దీనిపై ఎలాంటి రాజీలేదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పేర్కొన్నారు. నగరంలోని విద్యుత ్‌సౌధా వద్ద సీఎం వ్యాఖ్యలకు నిరసనగా నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర ప్రజలు సానుకూ లంగానే ఉన్నారని, కొందరు పెట్టుబడిదారులు అక్కడ కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని తెలిపారు. తెలంగా ణపై కేంద్రం నిర్ణయం తీసుకున్న తరుణంలో తాము హైదరాబాద్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణకు ఎలాంటి డోకా ఉండదని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలను అక్కడి నేతలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌తో సహా పది జిల్లాల తెలంగాణ ఏర్పాటే తమ డిమాండ్‌ అని తెలిపారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.