నేర స్థలం పరిశీలన సాక్షులను విచారణ

రాయికల్, అక్టోబర్ 15(జనం సాక్షి):రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన పాలెపు సురేష్ తండ్రి సాయిలు, 32 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ అనునతడిని అదే గ్రామానికి చెందిన ఆకుల మల్లేశం తండ్రి దుమ్ములు, మున్నూరు కాపు మరియు నందగిరి గోపాల్, ముదిరాజ్ అనే వ్యక్తులు కులం పేరుతో దూషించి చేతులతో కొట్టిన విషయమై పిర్యాది పాలెపు సురేష్ ఫిర్యాదుపై సోమవారం రోజున పోలీస్ స్టేషన్లో ఆ ఇద్దరిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయినది. కాగా కేసు దర్యాప్తు గురించి మంగళవారం రోజున జగిత్యాల డిఎస్పీ తాట్లవాయి గ్రామానికి వచ్చి నేర స్థలమును పరిశీలించి, సాక్షులను విచారించినారు.