మోడీకి వీసా నో
వెంటాడుతున్న గుజరాత్ అల్లర్లు
వాషింగ్టన్, ఆగస్టు 16 (జనంసాక్షి) :
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి వీసా ఇవ్వకూడదని అమెరికా నిర్ణయించినట్టు ఓ అధికారి వెల్లడించారు. 2002లో గుజరాత్లో చెలరేగిన హింసాకాండ, మైనార్టీల ఊచకోత ఘటనలను ఆయన వెంటాడుతున్నాయి. ఎన్డీఏ ప్రచార సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీకి అమెరికా వీసా లభిస్తుందని బీజేపీ ఆశించింది. అయితే అమెరికా నిర్ణయం మార్చుకోకపోవడంతో నివ్వెరపోయింది. మోడీ ప్రధాని అవుతాడని బీజేపీ ఎంత ప్రచారం కల్పించిన అమెరికా నిర్ణయం మార్చుకోలేదు. ఆయనకు వీసా ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని జై పార్టిపాన్ యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ఫ్రీడం వైస్ చైర్మన్ పర్సన్ న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడింంచారు.