ఏపీఎన్‌జీవోల సభకు రాజకీయ నాయకులొస్తే అరెస్టు


హైదరాబాద్‌ సీపీ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) :
ఏపీఎన్జీఓలు తెలంగాణకు గుండెకాయగా ఉన్న హైదరాబాద్‌లో బహిరంగసభకు ఉద్యోగులు మినహా మిగతావారిని అనుమతించబోమని నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. సభ 19 షరతులతో కూడిన అనుమతి ఇచ్చామని చెప్పిన అనురాగ్‌శర్మ శుక్రవారం మరి కొన్ని నిబంధనలను చొప్పిం చారు. ఇది కేవలం ఉద్యోగుల సభ మాత్రమేనన్నారు. ఇందులో ఏఒక్క రాజకీయ నేతగాని, విద్యార్థి, లాయర్లు, డాక్టర్లు, మరే ఇతరత్రా వ్యక్తులను అనుమతిం చమన్నారు. చిట్టచివరికి ఉద్యోగుల కుటుంబ సభ్యులను కూడా అనుమతిం చబోమని కమిషనర్‌ ఏపీఎన్జీఓలకు స్పష్టం చేశారు. ఒకవేళ ఎన్‌జీవోల సభకు రాజకీయ పార్టీల నాయకులొస్తే వారిని అరెస్టు చేసి తీరుతామని సీపీ స్పష్టం చేశారు. నిబంధనలకు లోబడి సభ నిర్వహించుకోవాలని సూచించారు.