ఆటో కారు ఢీ : ఆరుగురికి గాయాలు

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని ఇటిక్యాల మండలం కొండేరు గ్రామ శివారులో జాతీయరహదారిపై కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.