జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

మహబూబ్‌నగర్‌ : ఐదో శక్తిపీఠమైన అలంపూర్‌ జోగులాంబ, దక్షిణ కాశీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ శంకర్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ,ఈవో గురురాజ న్యాయమూక్తికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. జడ్జి కుటుంబం స్వామివారికి అభిషేకం ,అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆలయాల విశిష్టతను వివరించి ,శేష వస్త్రాలతో సత్కరించారు.