జిన్నింగ్‌ మిల్లులో అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా హైదరాబాద్‌ – శ్రీశైలం ప్రధాన రహదారిపై వంగూరు సమీపంలో ఉన్న ఎస్‌వీఎస్‌ జిన్నింగ్‌ మిల్లులో విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 25 లారీల పత్తి దగ్దమైంది. సుమారు 80 లక్షల నష్టం జరిగిందని జిన్నింగ్‌ మిల్లు యాజమాన్యం తెలిపింది.సమాచారమందుకున్న అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌ ,అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.