పాలమూరు జిల్లాలో భూతగాదాలతో ఘర్షణ :పరిస్ధితి ఉద్రిక్తం

మహబూబ్‌నగర్‌ : అలంపూర్‌ మండలం జిల్లేడుపాడులో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. భూతగాదాలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జిల్లేడుపాడు గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.