కన్నకొడుకును హతమార్చిన తండ్రి

మెడ్జిల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మెడ్జిల్‌ మండలం జకినాలపల్లి గ్రామానికి చెందిన సాకలి సైదులు(30)ను అతని కన్నతండ్రి గొంతుకోసి హత్య చేశాడు. గత కొంతకాలంగా కుటుంబంలో తండ్రి, కొడుకుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తండ్రి నారాయణ ఇంటిముందు కత్తితో సైదులు గొంతు కోశాడు. గమనించిన స్థానికులు సైదులును కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు