8న జిల్లా పరిషత్‌ సమన్వయ సమీక్షా సమావేశం

నల్గొండ, జనవరి 31 (): జిల్లాలో 8వ తేదీన  జిల్లా పరిషత్‌ సమన్వయ సమీక్షా సమావేశం జరగనున్నట్లు జడ్పీ సీఈవో కోటిరెడ్డి తెలిపారు. ఈ సమావేశాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశం ఉదయం 11గంటలకు నిర్వహిస్తామని అన్నారు.  జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, మండలాభివృద్ధి అధికారులు ఈ సమావేశంలో తప్పక హజరు కావాలని జడ్పీ సీఈవో కోటిరెడ్డి సూచించారు.