9వ మైల్ తండా లో విష జ్వరాలు

 డాక్టర్ విరుగు నరేష్  ఆధ్వర్యంలో వైద్య శిబిరం

టేకులపల్లి, ఆగస్టు 17( జనం సాక్షి) : ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల మూలంగా ఎక్కడికక్కడ వాటర్ నిలవడంతో దోమల విపరీతంగా పెరగడం వలన మండల పరిధిలోని తొమ్మిదవ మేలు తండాలో విష జ్వరాలు ప్రబలాయి దీంతో సులానగర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ ఆధ్వర్యంలో బుధవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు . ఈ వైద్య శిబిరంలో 63 మంది కి వైద్య పరీక్షలు నిర్వహించి తగు చికిత్సను అందించారు. జ్వరంతో బాధపడుతున్న 14  మందికి రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. వారందరికీ మందులు పంపిణీ చేశారు. గ్రామస్తులకు వ్యక్తిగత పరిశుభ్రత ఈ సీజన్లో వచ్చే వ్యాధులు ,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఎట్టి పరిస్థితుల్లో అపరిశుభ్రమైన ఆహారం వీధుల్లోని ఆహారం తీసుకోవద్దని ఆహారం తీసుకునే ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత అత్యంత పరిశుభ్రంగా చేతులు కడుకోవాలని సూచించడం జరిగింది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని వైద్యాధికారి  సూచించారు.కరోనా ఈ సీజన్లో వచ్చే వ్యాధులు కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది.అనంతరం గ్రామంలోని ప్రతి ఇల్లు తిరిగి నిల్వ ఉన్న నీటిని తొలగించుకోవాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా దోమలు ఈగల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని, ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్లు 20 నిమిషాలు మరగబెట్టి చల్లార్చిన నీటిని తాగటంతో రక్షితమై తద్వారా నీటి ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని ప్రజలకు సూచించారు. అత్యంత పరిశుభ్రంగా ఆకుకూరలు, కాయగూరలు పావుగంట ఉప్పు నీళ్లలో నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి పరిశుభ్రమైన ప్రదేశాల్లోనే వాటిని వంటకు తయారు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జరుపుల బిచ్చా నాయక్, కార్యదర్శి ,సూపర్వైజర్లు గుజ్జా విజయ, నాగు బండి వెంకటేశ్వర్లు, ఏఎన్ఎంలు  ఎల్లమ్మ, లక్ష్మి, ఆశ కార్యకర్తలుపాల్గొన్నారు.