పెద్ద ధన్వాడకు వెళ్తున్న పౌర హక్కుల నేతలు అరెస్ట్
గద్వాల (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడ గ్రామానికి వెళుతున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మన్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండి సుభాన్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కా బాలయ్య, వెంకటేష్ లను బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఎర్రవల్లి చౌరస్తాలో అక్రమంగా అరెస్టు చేసి ఇటిక్యాల పోలీస్ స్టేషన్ కు తరలించారని, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ శంకర ప్రభాకర్ అన్నారు. పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీ రైతులపై పెట్టిన అక్రమ కేసుల విషయంలో పెద్దధన్వాడ వెళుతున్న పౌర హక్కుల నాయకులు అక్రమంగా అరెస్టును ప్రజా సంఘాలు, విద్యార్థి, కార్మిక కర్షక, మేధావులు ఖండించాలని ఆయన అన్నారు.