జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి సహకరించండి

` వరంగల్‌ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయండి
` హైదరాబాద్‌ – విజయవాడ పారిశ్రామిక కారిడార్‌ ఫీజుబిలిటీ అధ్యయన దశలో ఉంది
` పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్‌ అండ్‌ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి మద్దతివ్వండి
న్యూఢల్లీి(జనంసాక్షి):జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిపీయూష్‌ గోయల్‌ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢల్లీిలోని వాణిజ్య భవన్‌లో ఆయనతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టుల విషయంపై చర్చించారు.జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, అమలు కార్యక్రమం కింద ఆమోదించిన రూ. 596.61 కోట్లను సత్వరం విడుదల చేయాలని కోరారు. జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్‌, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ – వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా వరంగల్‌ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలని అభ్యర్ధించారు. హైదరాబాద్‌ – విజయవాడ పారిశ్రామిక కారిడార్‌ ఫీజుబిలిటీని అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు.తెలంగాణ ప్రభుత్వం ఆదిభట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేకమైన రక్షణ, ఏరోస్పేస్‌ పార్క్‌ను ఏర్పాటు చేసిందని వివరిస్తూ, హైదరాబాద్‌ – బెంగళూర్‌ పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్‌ కారిడార్‌గా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్‌ అండ్‌ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తామని, కేంద్ర ప్రభుత్వం వాటికి మద్దతుగా నిలవాలని గోయల్‌ను కోరారు. ముఖ్యమంత్రి పాటు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్‌, ఎంపీలు మల్లు రవి,చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

ఎరువులు సకాలంలో సరఫరా చేయండి
` లోటులేకుండా తెలంగాణకు కేటాయించిన పూర్తి స్థాయి కోటా అందించండి
` సరైన సమయంలో సరఫరా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు
` దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియాలో తెలంగాణకు కోటాను పెంచండి
` కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢల్లీి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. వానా కాలం సీజన్‌కు సంబంధించి ఏప్రిల్‌ – జూన్‌ మధ్య రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్‌ టన్నులకు గానూ కేవలం 3.07 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేశారని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు రావడం, వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. జులై నెలకు సంబంధించి దేశీయంగా ఉత్పత్తయిన యూరియా 63 వేల మెట్రిక్‌ టన్నులు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా 97 వేల మెట్రిక్‌ టన్నులు రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 29 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే చేశారని వివరిస్తూ వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే, తెలంగాణకు దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను పెంచాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. యూరియా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖ తగిన రేక్‌లు కేటాయించడం లేదని, వాటి సంఖ్య కూడా పెంచాలని కోరారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్‌, ఎంపీలు మల్లు రవి,చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.