ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

 

 

 

 

 

మేడిపల్లి, జనంసాక్షి : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

హైదరాబాద్ – మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అతి వేగంగా ప్రయాణిస్తూ, మెట్రో పిల్లర్ 97ను బలంగా ఢీకొట్టిన కారు. ఈ సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తుండగా సాయి వరుణ్, నిఖిల్ అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. వెంకట్, రాకేష్, యశ్వంత్ అనే ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వగా, సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ అనే ముగ్గురు విద్యార్ధులు సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.