సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీపీ కోలేటి మారుతి
మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బుధవారం ఉమ్మడి కమాన్ పూర్ మండల మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలేటి మారుతి కలిశారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.