బీమనపల్లి సర్పంచ్గా కర్నాటి వరలక్ష్మి పాండు బాధ్యతల స్వీకరణ

భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 23 (జనం సాక్షి):మండల పరిధిలోని బీమనపల్లి గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్గా కర్నాటి వరలక్ష్మి పాండు సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామ సచివాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగాదేవి గురవయ్యతో పాటు వార్డు సభ్యులు కూడా తమ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, నాయకులు సర్పంచ్ కర్నాటి వరలక్ష్మి పాండును శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలే ప్రధాన లక్ష్యంగా ప్రజలతో కలిసి సమన్వయంతో పనిచేస్తానని పేర్కొన్నారు.


