బైంసాలో మహిళ దారుణ హత్య

 

 

 

 

 

 

భైంసా డిసెంబర్ 08 (జనం సాక్షి) భైంసా పట్టణంలోని సంతోషిమాత మందీరం సమీపంలో గల నందన టీ పాయింట్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో హత్యకు గురైన మహిళ పక్కనే ఓ వ్యక్తి అక్కడనే కూర్చుని ఉండడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది.