హైదరాబాద్,నవంబర్8 (జనంసాక్షి) : ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని,వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవిూక్ష నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ భూముల లీజ్ రెంట్లు, భూ రికార్డుల ప్రక్షాళన, ఆలయ భూముల వేలం పక్రియలో పారదర్శకత, తదితర అంశాలపై మంత్రి అధికారులతో చర్చిస్తున్నారు. ఆలయ భూముల వ్వహారంలో దేవాదాయ శాఖ అధికారులు కూడా అలసత్వం విడనాడాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, డిప్యూటీ కమిషనర్లు, తదితరులు హాజరయ్యారు.
ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Other News
- తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణగా మార్చారు
- స్థానిక అవసరాలకనుగుణంగా.. కంపెనీల ఏర్పాటుకు ప్రాధాన్యం
- పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం
- జగన్కు కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు
- ఈశాన్య రాష్టాల్ల్రో.. కాంగ్రెస్ నిప్పు పెడుతుంది
- విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
- బ్రాండ్ హైదరాబాద్ను.. బ్రాండీ హైదరాబాద్గా మార్చారు
- పాకిస్థాన్ దేవాలయానికి.. భారత్ యాత్రీకులు
- వివేకా హత్యను సీబీఐకి అప్పగించాలి
- క్యాబ్పై ఎవరూ ఆందోళన పడొద్దు