అమర వీరుల స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి


` రాష్రాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం:మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
సూర్యాపేట(జనంసాక్షి):తెలంగాణా రాష్ట్రాన్ని రోల్‌ మోడల్‌ గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.అమరవీరుల త్యాగాల స్పూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనింప చేసేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందించుకున్నామని ఆయన వెల్లడిరచారు. తెలంగాణా రైజింగ్‌-2047 పేరుతో విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందిందని ఆయన పేర్కొన్నారు.తెలంగాణా రాష్ట్ర 12 వ ఆవిర్భావ వేడుకలను ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో సోమవారం ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గం రూపొందించిన తెలంగాణా రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ విశిష్టతను ఆయన వివరించారు.సంక్షేమం, సామజిక న్యాయం,గ్రీన్‌ ఎనర్జీ,ఇన్నోవేషన్‌, ఇండస్ట్రీ,టూరిజం ల అభివృద్ధికీ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందన్నారుతెలంగాణా రాష్ట్రాన్ని జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టడమే విజన్‌ డాక్యుమెంట్‌ ముఖ్య ఉద్దేశ్యమన్నారుఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గడిచిన 18 నెలలుగా 25 లక్షల 35 వేల 964 మందికి 20,617 కోట్ల రుణమాఫీ అమలు పరచామన్నారు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదట సాగు అయిన వానా కాలం,యాసంగి పంటల దిగుబడి యావత్‌ భారతదేశంలొనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టిందన్నారు.పండిన పంటను ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడమే కాకుండా,కొనుగోలు చేసిన దాన్యానికి 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు ఆయన వివరించారు.అంతటితో ఆగకుండా వ్యవసాయ చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో సన్నాల ప్రోత్సాహనికీ గాను ఒక్కో క్వింటా ఒక్కింటికీ 500 రూపాయలు బోనస్‌ చెల్లించామన్నారు.రైతుపక్షపాతిగా ప్రభుత్వం తీసుకున్న విధాన పర నిర్ణయాలు వ్యవసాయ రంగంలో అరుదైన రికార్డులు నమోదు చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలకు తార్కాణంగా నిలిచి పోసిసన్నారు.అదే సమయంలో నీటిపారుదల రంగాన్ని ఆధునికరించేందుకు వినూత్న సంస్కరణలకు అంకురార్పణ చుట్టమన్నారు నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ నుండి ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌, జానాపహాడ్‌ బ్రాంచ్‌ కెనాల్‌ తో పాటు పలు ఎత్తిపోతల పథకాల ద్వారా రైతాంగానికి సమృద్ధిగా నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు దానికి తోడు నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ తో పాటు మూసి,శ్రీరాంసాగర్‌ స్టేజ్‌ 2 ద్వారా సమృద్ధిగా నీరు అందిస్తున్నామన్నారు.అంతే కాకుండా ఇప్పటికే ఉన్న ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించడంతో పాటు అవసరమైన ప్రతి చోట నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు ప్రధానంగా భూరికార్డులను ఆధునికరించి ప్రజల్లో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితిలను నివారించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలులోకి తెచ్చిందన్నారు ఇప్పటికే మూడు నుండి 22 మండలాల్లో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయని దశల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు అన్నింటికీ మించి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు గాను మహాలక్ష్మి పథకాన్ని అమలు పరుస్తున్నామన్నారు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం,500 రూపాయలకె గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ, గృహజ్యోతి పధకం కింద ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు ఇందిరా మహిళా శక్తి కేంద్రాలు,క్యాంటీన్లు,స్వయం సహాయక సంఘాలకు శ్రీనిధి పధకం ద్వారా రుణాలు అందించి వారి వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కండ్లలో వెలుగులు నింపేందుకే అర్హులైన ప్రతి నిరుపేదకు 6 కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పధకాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకం దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయంగా ఆయన అభివర్ణించారు సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే జిల్లాలో 5 లక్షల 85 వేల 464 ఎకరాల వ్యవసాయ భూమి సాగులోకి వచ్చిందన్నారు.అందుకు అవసరమైన నీటిని నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ,మూసి,ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి సెకండ్‌ ఫెస్‌ ల నుండి అందిస్తున్నామన్నారు జిల్లాలో ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, కొత్త ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు వేగవంతంగా కోనసాగుతున్నాయన్నారు. హుజుర్నగర్‌, కోదాడ డివిజన్‌ లలో 13 కోట్ల అంచాన వ్యయంతో నూతన కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్ట బోతున్నట్లు ఆయన తెలిపారు ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 50,992 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 755.35 కోట్ల విలువ చేసే 3,25,601 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 550.54 కోట్ల నగదును రైతుల ఖాతాలో జమ చేశామన్నారు విద్యారంగంలో 20.40 కోట్ల వ్యయంతో 571 పాఠశాలలను అడునికరించినట్లు ఆయన వెల్లడిరచారు నీటిపారుదల రంగం నుండి విద్యావ్యవస్థ వరకు ప్రక్షాళన చేసి 2047 నాటికి తెలంగాణా రాష్ట్రాన్ని యావత్‌ భారతదేశంలొనే రోల్‌ మోడల్‌ గా తీర్చిదిద్దుతామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

తాజావార్తలు