విజయోత్సవంలో విషాదం
` ఆర్సిబి విజయోత్సవ సభలో అపశృతి
` చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట
` ఘటనలో 11 మంది మృతి….50మందికి గాయాలు
` భారీగా తరలివచ్చిన అభిమానులతో స్టేడియం వద్ద తోపులాట
` అదుపు చేయలేక చేతులెత్తేసిన బెంగళూరు పోలీసులు
` బెంగుళూరు చేరుకున్న ఆర్సీబీ జట్టుకు డిప్యూటి సీఎం స్వాగతం
బెంగళూరు(జనంసాక్షి): బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర అపశ్రుతి చోటు చేసుకుంది. ఆర్సిబి విజయోత్సాహంలో విషాదం చోటుచేసుకుంది. క్రికెటర్ల విజయోత్సవాతన్ని కళ్లారాచూడాలని తరలివచ్చిన అభిమానుల తోపులాట తొక్కిసలాటకు దారితీసింది. ఈ క్రమంలో పదిమంది మృత్యువాతపడ్డారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్పు సాధించిన ఆనందంలో అభిమానులు భారీగా చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది. చిన్నస్వామి స్టేడియం లోపలికి అభిమానులు తోసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బారికేడ్లు దూకి స్టేడియంలోకి వెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించారు. భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోయారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు.వారిని వివిధ అస్పత్రులకు తరలించారు.అభిమానులను నియంత్రించేందు కు చిన్నస్వామి స్టేడియం దగ్గర పోలీసులు లాఠీఛార్జ్ ప్రారంభించారు. స్టేడియం ఖాళీ చేయాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా పెను విషాదం చోటు చేసుకుంది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ.. ఐపీఎల్ లో తొలి టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్టేడియం వద్దకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సవిూపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్-2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సవిూపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. ఎన్నో పరాభవాల తర్వాత ఆర్సీబీ కల నెరవెరడంతో దేశవ్యాప్తంగా బెంగళూరు టీమ్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటు-న్నారు. ఆర్సీబీ టీమ్ ట్రోఫీతో తొలిసారి బెంగళూరుకు రాగా.. ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విమానాశ్రయానికి వెళ్లి ఆర్సీబీ జట్టుకు స్వాగతం పలికారు. విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య, టిమ్ డేవిడ్, దినేశ్ కార్తిక్లకు ఆయన పుష్పగుచ్ఛం అందించి స్వాగతం చెప్పారు. అనంతరం బెంగళూరు జట్టు ప్రత్యేక బస్సులో విధాన సౌధకు చేరుకుంది. ఈ క్రమంలో వేలాది అభిమానులు ఆర్సీబీ జెండాలు చేతబూని విధాన సౌధ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ’ఎర్రసముద్రాన్ని’ తలపించింది. ఆర్సీబీ ఆటగాళ్లు బస్సులో వస్తున్న మార్గంలోనూ అభిమానులు సందడి చేశారు.