జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి
మంచిర్యాల ప్రతినిధి, జూన్ 6 (జనంసాక్షి) : జోగులంబా జిల్లా రాజోలు మండలం పెద్దధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడి 12 గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేయగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘటనతో ఎలాంటి సంబంధం లేని జనంసాక్షి సంపాదకులు రెహమాన్ పై పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని మంచిర్యాల జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డేగ సత్యం పింగళి సంపత్ రెడ్డి డిమాండ్ చేశారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తా లో టీయూడబ్ల్యూజే (ఐజేయు) మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసనకార్యక్రమం చేపట్టారు .ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ…..పర్యావరణానికి, జల కాలుష్యానికి కారణమవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటానికి జనంసాక్షి కవరేజీ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం కక్ష పూరితంగా హైదరాబాద్ లో ఉన్న జనంసాక్షి ఎడిటర్ పై పెట్టిన కేసును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు పై సమగ్ర విచారణ జరిపించి సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐజెయు కౌన్సిల్ మెంబర్ కాచం సతీష్,కోశాధికారి కె వంశీ కృష్ణ , సాక్షి స్టాఫ్ రిపోర్టర్ ఆకుల రాజు ,నాయకులు డబ్బేటి తిరుపతి , ఉదయ్ కుమార్,బిరుదులు దేవరాజ్,సాక్షి రాజేష్ ,ఆవుల శ్రీధర్ ,కలవల శ్రీనివాస్,సాక్షి రిపోర్టర్ శ్రీనివాస్ ,జనంసాక్షి రిపోర్టర్లు నరేందర్గౌడ్, సత్యనారాయణ తదితరులు ప్రతిదిన్ పాల్గొన్నారు.