జనంసాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు ఎత్తివేయాలని గద్వాలలో నిరసన
గద్వాల (జనంసాక్షి): అక్రమంగా అన్యాయంగా జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై కేసు నమోదు చేయడానికి నిరసిస్తూ శుక్రవారం టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి డీఎస్పీ మొగులయ్య, కలెక్టరేట్ సూపర్డెంట్ కరుణాకర్ వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి, రామకృష్ణ మాట్లాడుతూ…బుధవారం (ఈనెల నాల్గవ తేదీన) రోజున జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని ఆలంపూర్ నియోజకవర్గ రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ గ్రామ సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం దగ్గర జరిగిన గొడవలో జనం సాక్షి, జనం టీవీ ఎడిటర్ రహమాన్ ను అన్యాయంగా, అక్రమంగా కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ లో ఏ2 నిందితునిగా చేర్చారు. వాస్తవంగా పత్రిక ఎడిటర్ నాల్గవ తేదీ బుధవారం రోజు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాడు. దీనికి తగ్గ సాక్షాలు ఉన్నాయి. కానీ ఫ్యాక్టరీ యజమాన్యం అన్యాయంగా, దుర్మార్గంగా ఈ కేసులో సంబంధంలేని వ్యక్తులపై ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేసేలా చూస్తున్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. గొడవలు సంబంధం లేని, సంఘటన స్థలం దగ్గర లేని పత్రిక ఎడిటర్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలి. దీనిపై ఎంక్వయిరీ చేసి మమ్మల్ని ఒక వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీవీ వెంకటేష్, ఆంధ్రప్రభ మధు, ఏబీఎన్ పురేందర్, హరికృష్ణ, మన తెలంగాణ ముస్తఫా, సిరాజ్, 4 టీవీ ఇబ్రహీం, చుక్క సుదర్శన్, కిరణ్ జహీర్, ఇస్మాయిల్, ఆనంద్, మూర్తి, సంగమేశ్వరప్ప, రామాంజనేయులు, నరసింహులు, మహబూబ్, గోపాల్, రఘు తదితరులు పాల్గొన్నారు.