అస్వస్థతకు గురైన హాస్టల్ విద్యార్థులు
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీ చైతన్య కళాశాల వసతి గృహంలోని కొందరు విద్యార్థులు గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు బుధవారం రాత్రి మాంసాహారం భుజించారని, అందువల్లే అస్వస్థతకు గురైనట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఈ సంఘటనతో భయభ్రాంతులకు గురైన తోటి విద్యార్థులు కొందరు ఇంటికి బయలుదేరారు.