ఉనికి చాటుకునేందుకే వైఎస్ విజయమ్మ దీక్ష: గండ్ర
హైదరాబాద్: వైకాపా రాజకీయంగా ఉనికి చాటుకునేందుకే వైఎస్ విజయమ్మ దీక్ష చేపట్టారని ప్రభుత్వం చీఫ్ విప్ గండ్రవెంకట్రమణారెడ్డి విమర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బోధన రుసుములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.



