కరీంనగర్‌లో తెలంగాణ ప్రజా పోరుయాత్ర

కరీంనగర్‌: సీపీఐ చేపట్టిన తెలంగాణ ప్రజాపోరు యాత్ర ఖమ్మం జిల్లాలో ప్రారంభమై ఇప్పటికే తెలంగాణ నాలుగు జిల్లాల్లో కొనసాగింది. ఈ రోజు నుంచి కరీంనగర్‌లో కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు సీపీఐ యాత్ర జిల్లాలో సాగుతుందని ఆ పార్టీ నాయకులు తెలియజేశారు.