లోకాయుక్తగా జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

` ఉప లోకాయుక్తగా బీఎస్‌ జగ్జీవన్‌ కుమార్‌ కూడా..
` ప్రమాణం చేయించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
` రాజభవన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో లోకాయుక్త , ఉపలోకాయుక్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. లోకాయుక్తగా జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి , ఉపలోకాయుక్తగా బి.ఎస్‌.జగ్జీవన్‌ కుమార్‌ సోమవారం నాడు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి , పలువురు ప్రముఖులు హాజరయ్యారు.జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి ,బి.ఎస్‌.జగ్జీవన్‌ కుమార్లు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తూ, రాష్ట్రంలో అవినీతిని నిరోధించడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా హాజరైన వారు ఆశాభావం వ్యక్తం చేశారు. వీరి నియామకం రాష్ట్ర పాలనలో మరింత పారదర్శకత , జవాబుదారీతనాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా పరిగణించబడుతోంది. లోకాయుక్త , ఉపలోకాయుక్తల నియామకంతో ప్రజలు తమ సమస్యలను, అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను నిష్పక్షపాతంగా విచారించే ఒక ఉన్నత స్థాయి వేదికను ఆశించవచ్చు.

తాజావార్తలు