కాంగ్రెస్‌, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ, ఒకరి మృతి

వరంగల్‌: జిల్లాలోని మరిపెడ మండలం తాళ్లవూకల్లులో మంగళవారం రాత్రి కాంగ్రెస్‌, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రామన్న అనే తెదేపా కార్యకర్త మృతి చెందాడు. పాత కక్షల నేపధ్యంలోనే ఇరుపార్టీల మధ్య ఘర్షణ తలుత్తినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో భారీగా బలగాలను మోహరించారు.