కాంగ్రెస్‌ హయాంలో అవినీతే తప్ప అభివృద్ధి కరవైంది: చంద్రబాబు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు తీగలపై దుస్తులు ఆరేసుకోవాలని తాను ఎప్పుడో చెప్పానని ఇప్పుడు అదే విధంగా జరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ హయాంలో అవినీతే తప్ప అభివృద్ధి కరవైందన్నారు. చంచల్‌గూడ జైలాంతా కాంగ్రెస్‌ నేతలతో నిండిపోయిదన్న చంద్రబాబు ఇకపై మంత్రివర్త సమావేశాలన్నీ జైల్లోనే నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు. బీసీలను రాజకీయంగానూ, ఆర్థికంగానూ ప్రోత్సహించింది తెదూపాయే అన్నారు.