ధర్మాన ప్రసాదరావుకు బెయిల్ ఇవ్వడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం
హైదరాబాద్: వాన్పిక్ అక్రమాల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు బెయిల్ ఇవ్వడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యకతం చేసింది. జగన్, మోపిదేవి సహా ధర్మానను ఒకే కేసులో నిందితులుగా చేర్చిన సీబీఐ ధర్మానను అరెస్టు చేయకుండా ఎందుకు వదిలిపెటిందని ఆ పార్టీ నాయకుడు అంబటి రాంబబు ప్రశించారు. జగన్ అరెస్టు సక్రమమని చిత్రీకరించేందుకే గతంలో మోపిదేవిని అరెస్టు చేశారని అన్నారు.