నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తత

బలవంతంగా నీటిని విడుదల చేసుకున్న ఎపి అధికారులు
ఇరువైపులా మొహరించిన పోలీసులు
ఇదంతా కెసిఆర్‌ కుట్ర అన్న కోమటిరెడ్డి
రాజకీయనాయకులు స్పందించవద్దన్న వికాస్‌ రాజ్‌
కెసిఆర్‌ కుట్రలో భాగమే సాగర్‌ ఉద్రిక్తత
కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నీటి పంపకాలు:రేవంత్‌
నల్గొండ(జనంసాక్షి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ప్రాజెక్ట్‌ 26 గేట్లలో చెరో 13 గేట్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని బందోబస్తు నిర్వహించారు. ఏపీ వైపు వాహనాలకు రాకుండా ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి. తాత్కాలిక విద్యుత్‌తో ఏపీ అధికారులు దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటిని విడుదల చేసుకున్నారు. 5వ గేటు ద్వారా గంటకు 500 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు రోజుల్లో ప్రాజెక్ట్‌ డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకునే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ ఆయకట్టు రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దగ్గర గురువారం తెల్లవారురaామున ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చి నీటి విడుదలకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి దాటాక అక్రమంగా ప్రాజెక్టులోనికి చొరబడి డ్యామ్‌కు ముళ్లకంచె పెట్టారు. సాగర్‌ ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగ భాగం.. అంటే 13వ గేట్‌ వరకు ప్రాజెక్టు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు వాదిస్తున్నారు. నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు దాదాపు 500 మంది దాకా పోలీసు సిబ్బందితో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. వారిని డ్యామ్‌ కు కాపలాగా ఉన్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బందిపై దాడి చేసి.. వారి మొబైల్‌ ఫోన్లు కూడా లాక్కున్నారు. 13వ గేట్‌ వద్దకు చేరుకొని ముళ్ల కంచె పెట్టి.. డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. ఏపీ పోలీసులు.సాగర్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. పల్నాడు జిల్లాలో భారీగా మోహరించి రాత్రి సమయంలో సాగర్‌ కు వెళ్లారు. సాగర్‌ వద్ద విూడియాపై పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి జులుం ప్రదర్శించారు. విూడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ఏపీ పోలీసులు లాక్కున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసులు వెళ్లడంపై ఉత్కంఠ నెలకొని ఉంది. సాగర్‌ డ్యాంపై పోలీసుల హడావిడిపై కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పందించారు. సాగర్‌ డ్యాంపై పోలీసుల డ్రామా కేసీఆర్‌ పనే అని విమర్శించారు. ఓడిపోతున్నారని కేసీఆర్‌ కి అర్థమై  తెలంగాణ సెంటిమెంట్‌ రగిలిస్తున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు లేని హడావిడి పోలింగ్‌ రోజే ఎందుకు అవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ పోలీసులు కలిసి చేసే డ్రామాలు ఎవరూ నమ్మవద్దని కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ ఎన్నికల కోసం వాడుతున్నారు. కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని.. 90 సీట్లతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్‌ డ్యాం వద్ద జరుగుతున్న హైటెన్షన్‌ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వికాస్‌ రాజ్‌ స్పందించారు. రాజకీయ నేతలు ఎవరూ ఆ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. డ్యాం దగ్గర జరుగుతున్న వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని చెప్పారు.
కెసిఆర్‌ కుట్రలో భాగమే సాగర్‌ ఉద్రిక్తత:రేవంత్‌
నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తతలు కేసీఆర్‌ కుట్ర అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఆరోపించారు. నాగార్జున సాగర్‌ ఘటనపై స్పందించిన రేవంత్‌ రెడ్డి స్పందించారు. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత రేవంత్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్న కేసీఆర్‌ పన్నాగాలు ఫలించబోవని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక సమర్థంగా నీటి పంపకాల విషయాన్ని పరిష్కరిస్తామని రేవంత్‌ రెడ్డి హావిూ ఇచ్చారు. పోలింగ్‌ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తొమ్మిదిన్నర ఏళ్లుగా కేసీఆర్‌ ఈ సమస్యను పరిష్కరించకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్న మవుతున్నాయి. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం ప్రజామోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడటమే ముఖ్యమని అన్నారు. రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇతర రాష్టాల్రతో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తాం. దేశాల మధ్య నీటి వాటాలు పంచుకుంటున్నాం.. అలాంటిది రాష్టాల్ర మధ్య వాటాలు పంచుకోలేమా… అని అన్నారు. నీటి వాటాలు, ఆస్తుల పంపకాల విషయంలో కాంగ్రెస్‌ సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరిస్తుందని రేవంత్‌ హావిూ ఇచ్చారు.. అవసరమైనప్పుడు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్‌ ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్న కేసీఆర్‌ పన్నాగాలు ఫలించవు. కేసీఆర్‌ వి దింపుడు కల్లం ఆశలే.. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపాల్సిన అవసరం లేదు. వివాదాలను సామరస్యంగా సరైన పరిష్కారం చూపించే బాధ్యత మాది‘ అని రేవంత్‌ రెడ్డి అన్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసమేతంగా వెళ్లి కొడంగల్‌లోని జెడ్‌పీహెచ్‌ఎస్‌ బాయ్స్‌ సౌత్‌ వింగ్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నా రు. ఓటు వేసే ముందు ఆయన విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్నవార న్నారు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రభుత్వం రావాల న్నారు. రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వం నీటి సమస్యలపై సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా వ్యవహరి స్తామని స్పష్టం చేశారు. ఎలాంటి కుట్రలకు లొంగిపోవద్దని తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

 

పాలనను ఎండగట్టారు.