నీటిపారుదల శాఖ అధికారులపై పీఏసీ ఆగ్రహం

హైదరాబాద్‌: నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాథ్‌ దాన్‌, ఇంజనీరింగ్‌ చీఫ్‌లపై పీఏసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని పీఏసీ సభ్యులు అక్షేపించారు. కల్వకుర్తి అక్రమార్కులపై విజిలెన్స్‌ నివేదిక ఇచ్చినా ఎందుకు చర్య తీసుకోలేదని పీఏసీ ప్రశ్నించింది.