బీర్‌పూర్‌ లక్ష్మీనరసిహస్వామి హుండీ ఆదాయం రూ.40 వేలు

మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవా లయం బీర్‌పూర్‌ యోక్క హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం ఆలయ ఆవణలో చేపట్టారు.మూడు నెలలకుగాను చేపట్టిన ఈ హుండీ లెక్కింపు ద్వారా ఆలయానికి 40వేల 931 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ చైర్మెన్‌ మసర్తి రమేష్‌ తెలిపారు.ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ పవన్‌ కుమార్‌,నాయకులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.