భాజపా తెలంగాణ పదాధికారుల సమావేశం

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర కార్యాలయంలో భాజపా తెలంగాణ పదాధికారుల సమావేశం జరిగింది. భాజపా రాష్ట్ర అధక్ష్యతన జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్‌నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై భవిష్యత్‌ కార్యాచరణ, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై  సమావేశంలో చర్చించారు. ప్రత్యేక రాష్ట్రంపై త్వరలోనే కేంద్రం ప్రకటన వస్తుందంటూ సెప్టెంబరు 30న జరగబోయే తెలంగాణ మార్చ్‌ను నీరుగార్చే  ప్రయత్నం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.