రెండో రోజు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె

ఢిల్లీ:  రెండో రోజు దేశ వ్యాప్తంగా బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. దీంతో ఏటీఎంలపైనే ఖాతాదారులు ఆధారపడ్డారు. 24ప్రభుత్వ, 12ప్రైవేట్‌ బ్యాంక్‌లకు చెందిన ఉద్యోగలు సమ్మెలో పాల్గొన్నారని ఆలిండియా బ్యాంక్‌ ఉద్యోగుల అపోషియేషన్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటచలం తెలిపారు. బ్యాంకింగ్‌ రంగంలో పలు చట్టాలు సవరించే ప్రయత్నం మానాలని పెన్షన్‌ హౌసింగ్‌ లోన్లు రివిజన్‌ చేయాలని 5రోజుల పనిదినాలు ఉండాలని డిమాండ్‌ చేశారు.