వరంగల్కు బయలుదేరిన ముఖ్యమంత్రి
హైదరాబాద్: కాకతీయ ఉత్సవాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వరంగల్కు బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేంద్ర మంత్రులు చిరంజీవి, బలరాంనాయక్లతో కలిసి ఓరుగల్లు ఖిలాలో ప్రారంభిస్తారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా బొమ్మ కూరులో నిర్మించిన రిజర్వాయర్ను సీఎం జాతీకి అంకితం చేస్తారు.