వరంగల్‌ ఎంజీఎంలో మరో బాలుని మృతి

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిలో శిశు మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స పొందుతూ ఏడాది బాలుడు సుప్రిత్‌ మృతి చెందాడు. తమ చిన్నారి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.